శంషాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
- May 25, 2020
హైదరాబాద్:నేటి నుండి భారత దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత గగన విహారం చేస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన విమానాశ్రయంను సందర్శించారు. అక్కడున్న ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రయాణీకుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, టచ్ చేయకుండా..సెన్సార్ లు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణాలు సాగించే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని, ఈ యాప్ ఉన్న వారినే లోపలికి అనుమతినిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని సెక్యూర్టీ పరంగా, ఆరోగ్య పరంగా విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతినిస్తున్నామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల్ల క్వారంటైన్ అవసరం ఉండదన్నారు. 1600 మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయంకు మంజూరైన 30 విమానాల్లో 15 శంషాబాద్ నుంచి బయలుదేరేవి కాగా...మరో 15 ఇక్కడకు చేరుకుంటాయి. ప్రయాణీకులు విమానానికి సంబంధించిన ఆధారాలను దగ్గ ఉంచుకోవాలన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







