భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
- May 26, 2020
రెండు నెలల లాక్డౌన్ అనంతరం సడలింపుల్లో భాగంగా జనం రోడ్లపైకి వస్తున్నారు. కరోనా వారి కోసమే కాచుక్కూర్చున్నట్టుంది. వెంటనే అటాక్ చేస్తోంది. అందుకే గత నాలుగైదు రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్త కేసులు 6535రాగా, 146 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరింది. అయితే ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4167 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 60,491 మంది కోలుకోగా 80,722 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. లాక్డౌన్ కాలంలో మొత్తంగా లక్ష కేసులు నమోదైతే.. కేవలం వారం రోజుల వ్యవధిలో 45వేల కేసులు నమోదవండంతో వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందీ తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో అయితే కేసుల సంఖ్య రోజు రోజుకీ అధికమవుతోంది.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







