ఏ.పి:పేద అర్చకులు,ఇమామ్లు,మౌజామ్లు,పాస్టర్లకు ఆర్థికసాయం
- May 26, 2020
అమరావతి:ఏ.పిలో అర్చకులు, ఇమామ్లు, మౌజామ్లు, పాస్టర్లకు వన్టైమ్ సాయం కింద ఒక్కొక్కరికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి 33 కోట్ల 92 లక్షల రూపాయలు రెవన్యూ శాఖ విడుదల చేసింది. నేరుగా అర్హుల అకౌంట్లలో ఐదేసి వేల చొప్పున డిపాజిట్ చేస్తారు. కరోనా ప్రభావంతో ఆయా వర్గాలకూ ఆర్థిక ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో.. జీవన భృతి కింద వారికి ఈ సాయం చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. పేదల అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు సాయం కోసం ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖ, వక్ఫ్బోర్డు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లు ఉపయోగించుకోవాలని రెవెన్యూ శాఖ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 31 వేల మంది అర్చకులకు, 7 వేల మంది ఇమామ్లు-మౌజామ్లకు, దాదాపు 30 వేల మంది పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!







