ఏ.పి:పేద అర్చకులు,ఇమామ్లు,మౌజామ్లు,పాస్టర్లకు ఆర్థికసాయం
- May 26, 2020
అమరావతి:ఏ.పిలో అర్చకులు, ఇమామ్లు, మౌజామ్లు, పాస్టర్లకు వన్టైమ్ సాయం కింద ఒక్కొక్కరికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి 33 కోట్ల 92 లక్షల రూపాయలు రెవన్యూ శాఖ విడుదల చేసింది. నేరుగా అర్హుల అకౌంట్లలో ఐదేసి వేల చొప్పున డిపాజిట్ చేస్తారు. కరోనా ప్రభావంతో ఆయా వర్గాలకూ ఆర్థిక ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో.. జీవన భృతి కింద వారికి ఈ సాయం చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. పేదల అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు సాయం కోసం ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖ, వక్ఫ్బోర్డు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లు ఉపయోగించుకోవాలని రెవెన్యూ శాఖ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 31 వేల మంది అర్చకులకు, 7 వేల మంది ఇమామ్లు-మౌజామ్లకు, దాదాపు 30 వేల మంది పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







