హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్రయల్ నిలిపివేసిన WHO
- May 26, 2020
హెడ్రాక్సీక్లోరోక్విన్...కరోనాను జయించే దివ్యౌషధం అన్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా తాను ఆ మందులనే వాడుతున్నానని, ఆ మందు రక్షణ రేఖ అని వ్యాఖ్యానించారు. ఈ మందు కోసం ప్రపంచ దేశాలు భారత్ చేయి చాచాయి. అయితే తాత్కాలికంగా హైడ్రాక్సీక్లోరోక్వీన్ క్లినికల్ ట్రయల్స్ను నిలిపివేసినట్లు WHO పేర్కొన్నది. కోవిడ్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నట్లు ద ల్యాన్సెట్ తన రిపోర్ట్లో పేర్కొన్నట్లు WHO డైరక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను వాడడం నిలిపేసినట్లు ఆయన చెప్పారు. హెచ్సీక్యూ వినియోగంపై డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షిస్తున్నదని, దీనిలో భాగంగానే ఆ మాత్రలను వాడడం లేదని టెడ్రోస్ తెలిపారు. హైడ్రాక్సీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ద ల్యాన్సెట్ తన కథనంలో పేర్కొన్నది. హైడ్రాక్సీక్లోరోక్వీన్, క్లోరోక్వీన్ లాంటి మందులను కేవలం మలేరియా పేషెంట్లు వాడాలని టెడ్రోస్ తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







