'లాస్ట్ పెగ్' యాక్షన్ టీజర్ విడుదల
- May 28, 2020
భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్ చిత్రం. ఈ మూవీ మనిషి జీవితంలో జరిగే కాలానికి సంబంధించినది. యువతీ యువకుడు ప్రేమలో పడితే చివరికి తల్లిదండ్రులు చూపించిన అబ్బాయితో ఆ అమ్మాయి నిచ్చితార్థం అవుతుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మాజీ ప్రేమికుడు, మరియు నిచ్చితార్థం చేసుకున్న అబ్బాయి కలుస్తారు, ఇదంతా విధి ఆడిస్తున్న నాటకమని వారు భావిస్తారు. చివరికి ఏం జరిగింది ? ఆ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకుంటారు అనే అంశాలు సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ సంజయ్ మాట్లాడుతూ... తాజాగా యాక్షన్ టీజర్ ను విడుదల చేశాము త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ను విడుదల చేయబోతున్నాము, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.
నటీనటులు: భారత్ సాగర్, యశస్విని రవీంద్ర
టైటిల్: లాస్ట్ పెగ్
బ్యానర్: భవసపందన ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ & బిఎండబ్ల్యు
రచన, దర్శకత్వం: సంజయ్ వడత్. ఎస్
నిర్మాత: రజత్ దుగోజి సలేంకి
సంగీతం: లోకేష్
మ్యూజిక్ ప్రొడ్యూసర్: సంజీవ్.టి
డిఓపి: కార్తిక్ కుమార్ కొణిదెల
ఎడిటర్: రుత్విక్
పిఆర్ఓ: సాయి సతీష్
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







