కోవిడ్ 19: జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది విధులకు హజరు కావాలని ఆదేశాలు
- May 28, 2020
లాక్ డౌన్ తో అరకొరగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించనున్నాయి. జూన్ 14 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అంతా విధులకు హజరు అయ్యేందుకు దుబాయ్ అనుమతించింది. దీంతో జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సేవలు ప్రజలు అందుబాటులోకి రానున్నాయి. మే 31 నుంచి 50 శాతం సిబ్బంది విధులకు హజరవుతారని కూడా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే..కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని..అందుకే ప్రజలందరూ వీలైనంత వరకు డిజిటల్ సేవలనే వినియోగంచుకోవాలని కూడా సూచించారు. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ వేదికగా పలు రంగాల్లో సేవలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక మీదట కూడా డిజిటల్ సేవలను సమర్ధవంతంగా వినియోగంచుకొని స్మార్ట్ సిటీస్ లో దుబాయ్ ని ఆదర్శవంతంగా నిలపాలన్నారు. ఇదిలాఉంటే..ప్రభుత్వ సంస్థల్లో పూర్తి స్థాయి ఉద్యోగులు విధులకు హజరు కానుండటంతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







