కోవిడ్ 19: జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది విధులకు హజరు కావాలని ఆదేశాలు
- May 28, 2020
లాక్ డౌన్ తో అరకొరగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించనున్నాయి. జూన్ 14 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అంతా విధులకు హజరు అయ్యేందుకు దుబాయ్ అనుమతించింది. దీంతో జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సేవలు ప్రజలు అందుబాటులోకి రానున్నాయి. మే 31 నుంచి 50 శాతం సిబ్బంది విధులకు హజరవుతారని కూడా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే..కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని..అందుకే ప్రజలందరూ వీలైనంత వరకు డిజిటల్ సేవలనే వినియోగంచుకోవాలని కూడా సూచించారు. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ వేదికగా పలు రంగాల్లో సేవలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక మీదట కూడా డిజిటల్ సేవలను సమర్ధవంతంగా వినియోగంచుకొని స్మార్ట్ సిటీస్ లో దుబాయ్ ని ఆదర్శవంతంగా నిలపాలన్నారు. ఇదిలాఉంటే..ప్రభుత్వ సంస్థల్లో పూర్తి స్థాయి ఉద్యోగులు విధులకు హజరు కానుండటంతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు