కోవిడ్ 19: జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది విధులకు హజరు కావాలని ఆదేశాలు
- May 28, 2020లాక్ డౌన్ తో అరకొరగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించనున్నాయి. జూన్ 14 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అంతా విధులకు హజరు అయ్యేందుకు దుబాయ్ అనుమతించింది. దీంతో జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సేవలు ప్రజలు అందుబాటులోకి రానున్నాయి. మే 31 నుంచి 50 శాతం సిబ్బంది విధులకు హజరవుతారని కూడా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే..కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని..అందుకే ప్రజలందరూ వీలైనంత వరకు డిజిటల్ సేవలనే వినియోగంచుకోవాలని కూడా సూచించారు. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ వేదికగా పలు రంగాల్లో సేవలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక మీదట కూడా డిజిటల్ సేవలను సమర్ధవంతంగా వినియోగంచుకొని స్మార్ట్ సిటీస్ లో దుబాయ్ ని ఆదర్శవంతంగా నిలపాలన్నారు. ఇదిలాఉంటే..ప్రభుత్వ సంస్థల్లో పూర్తి స్థాయి ఉద్యోగులు విధులకు హజరు కానుండటంతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్