ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు
- May 28, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనామహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో కొత్తగా 54 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,8417కి చేరింది. అలాగే 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1958 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 824 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూల్ లో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 9,558 శాంపిల్స్ ను పరీక్షించారు. కాగా ఇప్పటివరకూ 59 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 45 కేసులలో నెల్లూరులో 2 , గుంటూరు లో 1 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 4గురు వచ్చారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు