ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

- May 28, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనామహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో కొత్తగా 54 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,8417కి చేరింది. అలాగే 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1958 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 824 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూల్ లో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 9,558 శాంపిల్స్ ను పరీక్షించారు. కాగా ఇప్పటివరకూ 59 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 45 కేసులలో నెల్లూరులో 2 , గుంటూరు లో 1 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 4గురు వచ్చారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com