సేఫ్టీ రూల్స్ ఉల్లంఘన: లేడీస్ అండ్ జెంట్స్ సెలూన్స్ మూసివేత
- May 28, 2020
షార్జా:షార్జా ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (ఎస్ఇడిడి), పలు లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ సెలూన్స్ని ఎమిరేట్లో మూసివేయడం జరిగింది. కరోనా వైరస్ ప్రికాషనరీ మెజర్స్ పాటించకపోవడంతో వీటి మూసివేతకు ఆదేశాలు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఇడిడి ఈ మేరకు పలు ఇన్స్పెక్షన్స్ నిర్వహించింది. స్టాఫ్ అలాగే విజిటర్స్ మాస్క్లు ధరించడం, గ్లోవ్స్ ధరించడం చేయాల్సి వుంది. సర్వీస్ కోసం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. వీటితోపాటుగా సెలూన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సి వుంటుంది. ఏ సంస్థ అయినా సంబందిత నిబంధనలు పాటించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎస్ఇడిడి హెచ్చరించింది. ఉల్లంఘనలకు సంబంధించి సాధారణ వ్యక్తులు ఫిర్యాదు చేయడానికి 80080000ని సంప్రదించాలని ఎస్ఇడిడి సూచించింది. షార్జా ఎకనమిక్ సోషల్ మీడియా అకౌంట్ @Sharjaheconomic అలాగే కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ (www.sedd.ae) ని కూడా సందర్శించవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







