అమృతం
- January 30, 2016కలిసే మొదలయ్యింది పయనం
నీళ్ళల్లో చేపల్లా ఈది
మబ్బుల్లో గువ్వల్లా యెగిరి
ఎండ తర్వాత వాన
వాన తర్వాత చలి
ఏ కాలం
ఎవరు పిలిస్తే వచ్చిందో అడగనేలేదు
ఆరిపోని చీకటి బాధనీ
జాడ తెలియని వేకువ గాధనీ
ఆరా తీయనేలేదు
కొమ్మను వీడి
రాలిపడుతున్న ఎండుటాకులా ఒకరం
మట్టిని చీల్చుకొని
పుడుతున్న లేత మొలకలా ఇంకొకరం
రుతువేదో మారినప్పుడు
దూరమెందుకవు తామో తెలియనేలేదు
చినుకుమీద మట్టికున్నంత ప్రేమ
మనకూ వున్నందుకు
దుఃఖ మంతా కవిత్వమేనని తెలిసింది
--పారువెల్ల(దుబాయ్)
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం