చమురు సంక్షోభం: బ్యాక్ టు పెవిలియన్
- January 30, 2016
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో చమురు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వలసదారులపై పన్నులను భారీగా వేస్తున్నాయి గల్ఫ్ దేశాలు. ప్రత్యేకించి ఒమన్లో వలసదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పెరిగిన అద్దెలు, దాంతోపాటుగా అన్నీ ఖరీదైపోవడంతో తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని వలసదారులు అంటున్నారు. తిరువనంతపురంకి చెందిన అరునమ్ సింగ్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో నలుగురు సభ్యులుంటారనీ, ఇదివరకటి రోజుల్లో హ్యాపీగా లైఫ్ గడిచిపోయేదనీ, మారిన పరిస్థితుల్లో జీవనం కష్టంగా మారడంతో కుటుంబాన్ని తిరిగి ఇండియాకి పంపించేసి, తానొక్కడినే షార్జాలో ఉండిపోయినట్లు చెప్పాడు. చీఫ్ కోఆర్డినేటర్, దుబాయ్ ఎన్జీవో వ్యాలీ ఆఫ్ లవ్ సి.పి. మాథ్యూ మాట్లాడుతూ, ఇప్పటికే పలువురు ఇండియన్స్ స్వదేశానికి వెళ్ళిపోయారనీ, ఇంకొందరు ఇండియాకి తమ కుటుంబాల్ని పంపేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒమన్లో కొత్తగా ప్రవేశపెట్టిన రూల్ ప్రకారం, జాబ్ కాంట్రాక్ట్స్ రద్దు చేసుకున్నవారు నిషేధిత సమయం వరకు తిరిగి ఒమన్లో ప్రవేశించేందుకు వీలు లేకపోవడం కూడా వలసదారులపై తీవ్ర ప్రభావం చూపినట్లు కాన్సుల్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చమురు సంక్షోభంతో కొన్ని దేశాలు భారీగా టాక్స్లు పెంచగా, మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. అన్ని దేశాలూ కలిసి వ్యాట్ని ఇంపోజ్ చేయాలనుకోవడంతో రానున్న రోజుల్లో గల్ఫ్ దేశాల్లో వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.గల్ఫ్ లో ప్రస్తుత పరిస్థితులు కి అద్దం పట్టే వార్త 'మా గల్ఫ్' వారి సౌజన్యం తో వాసుదేవ రావు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









