అమృతం
- January 30, 2016
కలిసే మొదలయ్యింది పయనం
నీళ్ళల్లో చేపల్లా ఈది
మబ్బుల్లో గువ్వల్లా యెగిరి
ఎండ తర్వాత వాన
వాన తర్వాత చలి
ఏ కాలం
ఎవరు పిలిస్తే వచ్చిందో అడగనేలేదు
ఆరిపోని చీకటి బాధనీ
జాడ తెలియని వేకువ గాధనీ
ఆరా తీయనేలేదు
కొమ్మను వీడి
రాలిపడుతున్న ఎండుటాకులా ఒకరం
మట్టిని చీల్చుకొని
పుడుతున్న లేత మొలకలా ఇంకొకరం
రుతువేదో మారినప్పుడు
దూరమెందుకవు తామో తెలియనేలేదు
చినుకుమీద మట్టికున్నంత ప్రేమ
మనకూ వున్నందుకు
దుఃఖ మంతా కవిత్వమేనని తెలిసింది
--పారువెల్ల(దుబాయ్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









