అబుధాబి:ట్యాక్సీ డబ్బుల చెల్లింపునకు కొత్త యాప్ ప్రారంభం
- May 31, 2020అబుధాబి:ట్యాక్సీ ఛార్జీలను చెల్లించేందుకు రవాణా శాఖ అధికారులు అబుధాబి ట్యాక్సీ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా డబ్బుల చెల్లింపు మరింత సులభతరం కానుంది. యాప్ సేవలను వినియోగించుకునేందుకు వినియోగదారులు..ముందుగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. యాప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలను పొందపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకునే సమయంలోనే డబ్బులను యాప్ ద్వారా చెల్లించొచ్చు. లేదంటే ట్యాక్సీ మీటర్ పై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా కూడా ఛార్జీలను చెల్లించవచ్చు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…