కార్మికుల పనివేళల్లో మార్పు
- May 31, 2020కువైట్: బహిరంగ ప్రదేశాలలో ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మానవ వనరుల శాఖ. రేపటి నుండి మొదలై ఆగస్టు చివరి వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అథారిటీ జనరల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా ఈ రోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వేసవి కాలపు కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కాలంలో పనిచేయడం కష్టతరం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఈ 3 నెలల వ్యవధిలో కమిషన్లోని తనిఖీ బృందాలు ప్రతిచోటా ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారనీ, ఆదేశాలను ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అహ్మద్ అల్ మౌసా అన్నారు. గడిచిన సంవత్సరాల్లో ఈ నిర్ణయం అమలు చేయడం వల్ల అనేక రంగాలలో అనేక కంపెనీల ఆమోదం మరియు అంగీకారం లభించిందని తద్వారా కార్మికులకు ఈ వేసవి ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని అహ్మద్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం