కార్మికుల పనివేళల్లో మార్పు
- May 31, 2020
కువైట్: బహిరంగ ప్రదేశాలలో ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మానవ వనరుల శాఖ. రేపటి నుండి మొదలై ఆగస్టు చివరి వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అథారిటీ జనరల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా ఈ రోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వేసవి కాలపు కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కాలంలో పనిచేయడం కష్టతరం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఈ 3 నెలల వ్యవధిలో కమిషన్లోని తనిఖీ బృందాలు ప్రతిచోటా ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారనీ, ఆదేశాలను ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అహ్మద్ అల్ మౌసా అన్నారు. గడిచిన సంవత్సరాల్లో ఈ నిర్ణయం అమలు చేయడం వల్ల అనేక రంగాలలో అనేక కంపెనీల ఆమోదం మరియు అంగీకారం లభించిందని తద్వారా కార్మికులకు ఈ వేసవి ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని అహ్మద్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







