కార్మికుల పనివేళల్లో మార్పు
- May 31, 2020కువైట్: బహిరంగ ప్రదేశాలలో ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మానవ వనరుల శాఖ. రేపటి నుండి మొదలై ఆగస్టు చివరి వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అథారిటీ జనరల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా ఈ రోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వేసవి కాలపు కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కాలంలో పనిచేయడం కష్టతరం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఈ 3 నెలల వ్యవధిలో కమిషన్లోని తనిఖీ బృందాలు ప్రతిచోటా ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారనీ, ఆదేశాలను ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అహ్మద్ అల్ మౌసా అన్నారు. గడిచిన సంవత్సరాల్లో ఈ నిర్ణయం అమలు చేయడం వల్ల అనేక రంగాలలో అనేక కంపెనీల ఆమోదం మరియు అంగీకారం లభించిందని తద్వారా కార్మికులకు ఈ వేసవి ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని అహ్మద్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..