అబుధాబి:ట్యాక్సీ డబ్బుల చెల్లింపునకు కొత్త యాప్ ప్రారంభం
- May 31, 2020
అబుధాబి:ట్యాక్సీ ఛార్జీలను చెల్లించేందుకు రవాణా శాఖ అధికారులు అబుధాబి ట్యాక్సీ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా డబ్బుల చెల్లింపు మరింత సులభతరం కానుంది. యాప్ సేవలను వినియోగించుకునేందుకు వినియోగదారులు..ముందుగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. యాప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలను పొందపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకునే సమయంలోనే డబ్బులను యాప్ ద్వారా చెల్లించొచ్చు. లేదంటే ట్యాక్సీ మీటర్ పై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా కూడా ఛార్జీలను చెల్లించవచ్చు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







