కార్మికుల పనివేళల్లో మార్పు
- May 31, 2020కువైట్: బహిరంగ ప్రదేశాలలో ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మానవ వనరుల శాఖ. రేపటి నుండి మొదలై ఆగస్టు చివరి వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అథారిటీ జనరల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా ఈ రోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వేసవి కాలపు కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కాలంలో పనిచేయడం కష్టతరం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఈ 3 నెలల వ్యవధిలో కమిషన్లోని తనిఖీ బృందాలు ప్రతిచోటా ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారనీ, ఆదేశాలను ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అహ్మద్ అల్ మౌసా అన్నారు. గడిచిన సంవత్సరాల్లో ఈ నిర్ణయం అమలు చేయడం వల్ల అనేక రంగాలలో అనేక కంపెనీల ఆమోదం మరియు అంగీకారం లభించిందని తద్వారా కార్మికులకు ఈ వేసవి ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని అహ్మద్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..