కోవిడ్-19:సౌదీ అరేబియా లో మసీదులు పునఃప్రారంభం
- May 31, 2020రియాద్: సౌదీ అరేబియాలో దాదాపు 2 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మసీదులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో సౌదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అయితే, ఇటీవల కేసుల సంఖ్య కొంచెం తగ్గుముఖం పట్టడంతో సడలింపులు ఇస్తున్నది.అందులో భాగంగానే ఇటీవల జూన్ 21న కర్ఫ్యూ గడువు ముగిసేలోపు మక్కా మినహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మూడు దశల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఇవాళ మసీదుల్లో ప్రార్థనలపై నిషేధాన్ని ఎత్తివేసింది.
అయితే, మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లేవారికి సౌదీ సర్కారు కొన్ని నిబంధనలు విధించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖాలకు మాస్కులు ధరించాలని, ప్రార్థనల కోసం ఎవరి మ్యాట్ను వారే తెచ్చుకోవాలని సూచించింది. అదేవిధంగా ఒకరికి ఒకరు కనీసం రెండు మీటర్ల దూరం కచ్చితంగా పాటించాలని సూచించింది. ఒకరికి ఒకరు ఎట్టి పరిస్థితుల్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోరాదని ఆదేశించింది. ఎవరైన ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన