అబుధాబి: Dh15 మిలియన్లతో బిగ్ టికెట్ క్యాష్ ప్రైజ్, మరో 15 మంది కన్సోలేషన్ బహుమతులు
- June 02, 2020భారీ బంపర్ డ్రాతో పాటు అదనపు క్యాష్ ప్రైజ్ లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ టికెట్ నిర్వాహకులు . జులై నెలకి సంబంధించి అబుధాబి వేదిక జరిగే ఈ బంపర్ డ్రాలో జాక్ పాట్ విన్నర్ ప్రైజ్ మనీ DH15 మిలియన్లుగా ప్రకటించారు. బంపర్ డ్రాతో పాటు మరో 15 మందికి కన్సోలేషన్ బహుమతులు కూడా ప్రకటించనున్నారు. బిగ్ టికెట్ డ్రా చరిత్రలో ఇదే అత్యధికం కావటం విశేషం. ఎక్కువ సంఖ్యలో కన్సోలేషన్ బహుమతులు ఇవ్వటం ద్వారా తమ వినియోగదారుల్లో ఎక్కువ మందికి డ్రాలో విజయం సాధించే అవకాశం కలిపించినట్లు అవుతోందని...ఇది తమ వినియోగదారుల సంఖ్యను కూడా పెంపొందించేందుకు దోహదపడుతుందని బిగ్ టికెట్ నిర్వాహకులు వెల్లడించారు. పలు రకాల గ్రాండ్ ప్రైజ్ లతో ప్రతి నెల తమ వినియోగదారుల్లో ఉత్సుకత రేకెత్తించేలా కొత్త మార్గాలను అణ్వేషిస్తూనే ఉంటామని తెలిపారు. DH15 మిలియన్లు జాక్ పాట్ విన్నర్ తో పాటు 15 క్యాష్ ప్రైజ్ లు గెలుచుకునే డ్రా కోసం తాము కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు బిగ్ డ్రా నిర్వాహకులు చెబుతున్నారు. కన్సోలేషన్ ప్రైజ్ మనీ గెలుచుకునే వారిలో ముగ్గురికి DH 100,000 నగదు బహుమతులు, ఇద్దరికి DH 80,000 బహుమతులు, మరో ముగ్గురికి DH 75,000, DH 50,000, DH 25 వేల నగదు బహుమతులు కూడా ఉంటాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం