మస్కట్:నిర్మాణ రంగంలోని కార్మికులకు మధ్యాహ్నం వేళలో 3 గంటల విశ్రాంతి

- June 02, 2020 , by Maagulf
మస్కట్:నిర్మాణ రంగంలోని కార్మికులకు మధ్యాహ్నం వేళలో 3 గంటల విశ్రాంతి

మస్కట్:వేసవి ఎండల నుంచి రక్షించుకునేందుకు నిర్మాణ రంగంలోని కార్మికులకు పని వేళ్లలో స్వల్ప మార్పులు ప్రకటించింది మానవ వనరుల శాఖ. ఈ మూడు నెలల పాటు వేసవి ఎండలు అతి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్నం వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు పనులు పురమాయించొద్దని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల వరకు వారికి మధ్యాహ్నన విరామ సమయంగా ప్రరిగణించాలని కోరింది. జూన్, జులై, ఆగస్ట్ మాసాలకు సంబంధించి ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయి.  కార్మిక చట్టాల్లోని ఆర్టికల్ 16-3 ప్రకారం నిర్మాణ రంగంలోని కార్మికులకు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ పని చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. కార్మిక చట్టాలను అనుసరించి ఈ మూడు నెలలు మిడ్ డే బ్రేక్ సమయాలను మానవ వనరుల శాఖ అమలు చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com