మస్కట్:నిర్మాణ రంగంలోని కార్మికులకు మధ్యాహ్నం వేళలో 3 గంటల విశ్రాంతి
- June 02, 2020
మస్కట్:వేసవి ఎండల నుంచి రక్షించుకునేందుకు నిర్మాణ రంగంలోని కార్మికులకు పని వేళ్లలో స్వల్ప మార్పులు ప్రకటించింది మానవ వనరుల శాఖ. ఈ మూడు నెలల పాటు వేసవి ఎండలు అతి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్నం వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు పనులు పురమాయించొద్దని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల వరకు వారికి మధ్యాహ్నన విరామ సమయంగా ప్రరిగణించాలని కోరింది. జూన్, జులై, ఆగస్ట్ మాసాలకు సంబంధించి ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయి. కార్మిక చట్టాల్లోని ఆర్టికల్ 16-3 ప్రకారం నిర్మాణ రంగంలోని కార్మికులకు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ పని చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. కార్మిక చట్టాలను అనుసరించి ఈ మూడు నెలలు మిడ్ డే బ్రేక్ సమయాలను మానవ వనరుల శాఖ అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







