శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి...
- June 02, 2020తిరుమల:శ్రీవారి దర్శనానికి భక్తులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో తిరుమలకు భక్తులును వెళ్లకుండా నిలిపివేశారు. అయితే, లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయడంతో భక్తులకు అనుమతి లభించింది. అయితే, ముందుగా శ్రీవారి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అయితే, కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు ఆరు అడుగులు దూరం పాటించాలని అన్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు దర్శనానికి అనుమతి కోరుతూ ఎగ్జ్సిక్యూటివ్ అధికారి రాసిన లేఖకు అనుగుణంగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అనుమతిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..