శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి...

- June 02, 2020 , by Maagulf
శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి...

తిరుమల:శ్రీవారి దర్శనానికి భక్తులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో తిరుమలకు భక్తులును వెళ్లకుండా నిలిపివేశారు. అయితే, లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేయడంతో భక్తులకు అనుమతి లభించింది. అయితే, ముందుగా శ్రీవారి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అయితే, కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు ఆరు అడుగులు దూరం పాటించాలని అన్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు దర్శనానికి అనుమతి కోరుతూ ఎగ్జ్సిక్యూటివ్ అధికారి రాసిన లేఖకు అనుగుణంగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ అనుమతిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com