మహారాష్ట్ర: 47 మంది పోలీసు సిబ్బందికి కరోనా
- June 03, 2020
మహారాష్ట్రలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. కొత్తగా 2287 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. 47 మంది పోలీసు సిబ్బంది COVID-19 కు పాజిటివ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం సోకిన పోలీసు సిబ్బంది సంఖ్య 2,556 కు చేరుకుందని తెలిసింది. ఇక గత 24 గంటల్లో 1225 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 103 మంది రోగులు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 72 వేల 300 మంది సోకినట్లు గుర్తించారు.
మే 26 నుండి మే 31 వరకు దేశంలోని మొత్తం కరోనా కేసులలో మహారాష్ట్ర వాటా 43% నుండి 35% కి పడిపోయింది. ఇదిలావుంటే దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 2 లక్షల 7 వేల 910 కు పెరిగింది. గత 24 గంటల్లో 8,909 కొత్త పాజిటివ్ కేసులు వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తెలిపింది. గత 24 గంటల్లో 8,909 కొత్త పాజిటివ్ కేసులు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







