ఇమామ్ కు కరోనా లక్షణాలు.. మసీదు తాత్కాలిక మూసివేత..
- June 04, 2020
సౌదీ: సౌదీ అరేబియా నగరమైన దమ్మామ్లోని మసీదుకు చెందిన ఇమామ్ కు కరోనా సోకిందని అనుమానం కలుగగా ఆ మసీదును తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు సౌదీ మీడియా గురువారం నివేదించింది. సౌదీ లో మసీదులు తిరిగి తెరిచిన కొద్ది రోజుల తరువాతే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
తనకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రాంతంలోని మంత్రిత్వ శాఖకు మరియు భక్తులకు ఇమామ్ స్వయంగా వాట్సాప్ ద్వారా ఈ విషయం తెలియజేయగా వెంటనే అప్రమత్తమైన ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మసీదును మూసివేసింది. తాత్కాలిక మూసివేత సమయంలో మసీదు పూర్తిగా క్రిమిరహితం చేయబడుతుందని తెలిపిన అధికారులు.
కాగా, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి రావాలనే ప్రణాళికకు అనుగుణంగా సౌదీ లో మక్కా మినహా 900,000 మసీదులను ఆదివారం తిరిగి తెరిచిన తరువాత ఇదే మొదటి షట్డౌన్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







