ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు
- June 04, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 9,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.నిన్న ఒక్క రోజు కోవిడ్ వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 19 మంది కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చిన వారు ఉన్నారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,377 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 2,273 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 71కు చేరగా, ప్రస్తుతం 1,033 మంది వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







