తుని ఘటన చాలా బాధాకరం--ఏపీ సీఎం

- January 31, 2016 , by Maagulf
తుని ఘటన చాలా బాధాకరం--ఏపీ సీఎం

తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ఘటన చాలా బాధకరమని ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తన రాజకీయ జీవితంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన జరగలేదని అన్నారు. అకారణంగా రాజకీయ దురుద్దేశంతో దారుణ పరిస్థితి సృష్టించారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడుల సాధన కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే దీనిపై పూర్తిగా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల్లోని పేదలను బీసీల్లో చేర్చేవిధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com