ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

- June 06, 2020 , by Maagulf
ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. రాష్ట్రంలో గడిచిన  24 గంటల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి శనివారం ఉదయం 9 గంటల వరకూ.. 12,771 సాంపిల్స్ ని పరీక్షించగా 161 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

మరోవైపు 29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3588 పాజిటివ్ కేసులకు గాను 2323 మంది డిశ్చార్జ్ కాగా, 79 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1192 గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com