కరోనాపై పోరాటం: వైరస్ వ్యాప్తికి కారణమైన వ్యక్తులకు ఐదేళ్ల జైలుశిక్ష..లక్ష దిర్హామ్ జరిమానా
- June 07, 2020
యూఏఈ:కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా యూఏఈ ప్రభుత్వం గత చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగాగానీ, నిర్లక్ష్యంతోగానీ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైతే..వారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా విధించనుంది. యూఏఈ చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించే హక్కు ఉంది. ఆ హక్కుకు భంగం కలిగించేలా ఇతరులు ఉద్దశ్యపూర్వకంగా వ్యాధులను వ్యాప్తి చెందించటం నేరం. ఇందులో భాగంగానే గత ఆరేళ్ల క్రితమే యూఏఈ ప్రభుత్వం అంటువ్యాధుల నివారణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కావాలని అంటువ్యాధులను వ్యాప్తి చెందేలా చేసిన వారికి 50 వేల నుంచి లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా విధించొచ్చు. అలాగే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ ఈ నేరం మళ్లీ చేస్తే శిక్ష రెట్టింపు అవుతోంది. ఇక అంటువ్యాధి బారిన పడి సదరు వ్యక్తి చనిపోతే..వ్యాధి వ్యాప్తికి కారణమైన వ్యక్తికి మరో మూడేళ్లు అదనంగా జైలు శిక్ష విధిస్తారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







