తెలంగాణలో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు

- June 09, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 3,920కు చేరింది. మొత్తంగా 148మంది ప్రాణాలు కోల్పోగా,  1,742 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,030 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కొత్తగా వచ్చిన కేసుల్లో 143 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 10, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌లో రెండేసి చొప్పున నమోదు కాగా, జగిత్యాల, అసిఫాబాద్‌, సిరిసిల్లా, వరంగల్‌ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com