కాలం చెల్లిన ఆహారపదార్ధాలను జప్తు చేసిన ఒమన్ అధికారులు

- June 09, 2020 , by Maagulf
కాలం చెల్లిన ఆహారపదార్ధాలను జప్తు చేసిన ఒమన్ అధికారులు

మస్కట్:ప్రజల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించిన ఒమన్ ప్రభుత్వం..నిల్వ చేసిన ఆహారా పదార్ధాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించింది. పనికిరాని ఆహర పొట్లాలను సీజ్ చేశారు పోలీసులు. దోఫర్ లో ఆహార భద్రత విభాగం అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి...ఎక్కువ రోజులుగా నిల్వ చేసిన ఆహార పదార్ధాలను, తినేందుకు పనికి రాని పదార్ధాలను సీజ్ చేశారు. ప్రాంతీయ మునిసిపాలి, జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తూ ప్రజా ప్రయోజనం కోసం ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి దోఫర్ గవర్నరేట్ పరిధిలో తరచుగా సోదాలు నిర్వహిస్తామని వర్తకులకు వార్నింగ్ ఇచ్చారు. గిడ్డంగుల్లో నిల్వ చేసిన పదార్ధాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ సోదాలో కాలం చెల్లిన ఆహార పదార్ధాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com