వందే భారత్ మిషన్ 3: యూఏఈ నుంచి ఇండియాకు 45 ఫ్లైట్లు

- June 10, 2020 , by Maagulf
వందే భారత్ మిషన్ 3: యూఏఈ నుంచి ఇండియాకు 45 ఫ్లైట్లు

యూఏఈ:లాక్ డౌన్ తో యూఏఈలో చిక్కుకుపోయిన ప్రవాసీయులను భారత్ తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ మూడో దశ షెడ్యూల్ ప్రకటించారు అధికారులు. యూఏఈ నుంచి భారత్ కు మొత్తం 45 విమాన సర్వీసులను నడపనున్నారు. అయితే..ఇందులో 44 సర్వీసులు కేరళకు కేటాయించారు. మరో సర్వీసును మాత్రం ఒడిషాకు నడపనున్నారు. మొత్తం విమాన సర్వీసులను కేరళకే కేటాయించటం పట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దీంతో వాళ్లంతా రెండో దశ వందే భారత్ మిషన్ లోని విమాన సర్వీసులపైనే ఆశలు పెంచుకున్నారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా షెడ్యూల్ చేసిన విమాన సర్వీసుల్లో తమకు సీట్లు కన్ఫమ్ కావాలని ఆశిస్తూ ప్రార్ధనలు చేస్తున్నారు. ఇదిలాఉంటే వందే భారత్ మిషన్ రెండో దశలో భాగంగా ఈ నెల 9 నుంచి 19 వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. సెకండ్ ఫేజ్ లో మొత్తం 25 విమాన సర్వీసులను ప్రకటించగా అందులో 8 కేరళకు నడపనున్న విషయం తెలిసింది. అయితే..ఆ తర్వాత షెడ్యూల్ ను సవరించి మరో 5 విమానాలను ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, హైదరాబాద్, లక్నో నగరాలకు ఈ నెల 21, 23న నడపనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com