RO300 మిలియన్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు..ఆదేశాలు జారీ చేసిన ఒమన్ సుల్తాన్
- June 10, 2020
మస్కట్: ఒమన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమలు బాధ్యతను తమ సంస్థకు అప్పగించినట్లు ఒమనీ ఇన్వెస్టిమెంట్ కార్పోరేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒమన్ లో 300 మిలియన్ల ఒమనీ రియల్స్ తో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల ప్రాజెక్టును తమ సంస్థకు అప్పగిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ దేశాలను జారీ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నెల మొదటి వారంలో రాయల్ డిక్రీ ద్వారా ఈ ప్రైవేట్ సంస్థ ప్రారంభమైన విషయం తెలిసింది. ఈ సంస్థ నేరుగా సుల్తాన్ కు లోబడి ఉంటుంది. సుల్తాన్ కు చెందిన భూభాగంలో నివసించే ప్రజలు పట్ల సుల్తాన్ తెలివైన నాయకత్వంలో పురోగతి సాధించేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ కంపెనీ తన ప్రకటనలో అకాంక్షించింది. ఈ నెల మొదటి వారంలో ఏర్పడిన ఈ కంపెనీ 300 మిలియన్ల ఒమన్ రియాల్స్ తో ఖజీన్ ఎకనామిక్ సిటీ అభివృద్ధి చేయనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







