ఏ.పీ‌లో కొత్తగా 246 కరోనా పాజిటివ్ కేసులు

- June 15, 2020 , by Maagulf
ఏ.పీ‌లో కొత్తగా 246 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏ.పీ‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 246 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5087​కి చేరింది. తాజాగా రెండు మరణాలు సంభవించడంతో మొత్తం మృత్యుల సంఖ్య 86కి పెరిగింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 2770 మంది బాధితులు కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2231 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు వైరస్‌ నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com