కువైట్:గత వారం నాటికి దేశం నుంచి 21,163 మంది అక్రమ నివాసితుల తరలింపు
- June 16, 2020
సరైన అనుమతులు లేకుండా నివసిస్తున్న 80 శాతం మంది ప్రవాసీయులను వారి సొంత దేశాలకు తరలించింది కువైట్ ప్రభుత్వం. ప్రస్తుతం 26,472 మంది ప్రవాసీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించి కువైట్ లో ఉంటున్నారు. అయితే..కరోనా నేపథ్యంలో వాళ్లందరికీ క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసింది. నిర్ణీత గడువులోగా వారి సొంత దేశాలకు వెళ్తే ఎలాంటి శిక్షలు ఉండవని గతంలోనే ప్రకటించింది. దీంతో అక్రమ నివాసితులు వారి వారి సొంత దేశాలకు వెళ్లిపోతున్నారు.
గత వారం నాటికి 21,163 మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారిని కూడా వారి వారి దేశాలకు తరలించేందుకు విదేశాంగ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే కువైట్ లో సరైన ధృవ పత్రాలు లేకుండా నివసిస్తున్న వాళ్లలో ఎక్కవగా భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 7,181 మంది భారతీయులు ఉంటే..5,799 మందిని ఇప్పటికే స్వదేశానికి తరలించారు. మరో 1,204 మందిని తరలించాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







