కువైట్:గత వారం నాటికి దేశం నుంచి 21,163 మంది అక్రమ నివాసితుల తరలింపు
- June 16, 2020
సరైన అనుమతులు లేకుండా నివసిస్తున్న 80 శాతం మంది ప్రవాసీయులను వారి సొంత దేశాలకు తరలించింది కువైట్ ప్రభుత్వం. ప్రస్తుతం 26,472 మంది ప్రవాసీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించి కువైట్ లో ఉంటున్నారు. అయితే..కరోనా నేపథ్యంలో వాళ్లందరికీ క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసింది. నిర్ణీత గడువులోగా వారి సొంత దేశాలకు వెళ్తే ఎలాంటి శిక్షలు ఉండవని గతంలోనే ప్రకటించింది. దీంతో అక్రమ నివాసితులు వారి వారి సొంత దేశాలకు వెళ్లిపోతున్నారు.
గత వారం నాటికి 21,163 మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారిని కూడా వారి వారి దేశాలకు తరలించేందుకు విదేశాంగ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే కువైట్ లో సరైన ధృవ పత్రాలు లేకుండా నివసిస్తున్న వాళ్లలో ఎక్కవగా భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 7,181 మంది భారతీయులు ఉంటే..5,799 మందిని ఇప్పటికే స్వదేశానికి తరలించారు. మరో 1,204 మందిని తరలించాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







