తెలంగాణలో కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు

- June 15, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో  కొత్తగా  219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,193కు చేరింది. కరోనా ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 187 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 2,766 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రసుత్తం 2240 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

కొత్తగా వచ్చిన కేసుల్లో 189 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన వాటిలో మేడ్చల్‌ 2, రంగారెడ్డి 13, సంగారెడ్డి 2, వరంగల్‌ అర్బన్‌ 4, వరంగల్‌ రూరల్‌ 3, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు  ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి.తెలంగాణ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com