కార్మికులను మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై దృష్టి: విదేశాంగ మంత్రి మురళీధరన్
- June 16, 2020
భారత విదేశాంగ శాఖ: న్యూ ఢిల్లీలో జరిగిన 3 వ వార్షిక 'ప్రొటెక్టర్స్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' సమావేశంలో విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ కార్మికులను ఉపాధి పేరిట మోసం చేస్తూ విదేశాలకు పంపుతున్న నకిలీ ఏజెన్సీలపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. అటువంటి ఏజెన్సీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించి వారిపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అనధికార ఏజెన్సీల అనైతిక వ్యూహాలకు బలైపోతున్న వలసదారుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ ఉపాధి కోసం వెళ్లే కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడానికి గత ఆరు సంవత్సరాల్లో చర్యలు తీసుకున్నప్పటికీ, మోసం, అక్రమ వలసలు మరియు సాంకేతిక దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు నియంత్రణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం త్వరలో కొత్త ఇమ్మిగ్రేషన్ మేనేజ్మెంట్ బిల్లును తీసుకువస్తుందని మురళీధరన్ అన్నారు. ఈ బిల్లు ద్వారా సురక్షితమైన ఇమ్మిగ్రేషన్ వాతావరణానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు.
"చాలా సంవత్సరాలుగా విదేశాలలో నివసించిన అధునాతన నైపుణ్యం గల ఎందరో వలసదారులు కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. వీరు తమ నైపుణ్యంతో భారతదేశ అభివృద్ధికి దోహదపడతారు. కాబట్టి 'వందే భారత్ మిషన్' ద్వారా ఈ డేటా ను సేకరించి అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉన్నాము" అని ఈ సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపిన విషయం విదితమే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







