కువైట్: ఆఫీసుల కార్యాకలాపాల నిర్వహణకు మార్గనిర్దేశకాలు జారీ చేసిన సివిల్ సర్వీస్ కమిషన్
- June 16, 2020
కువైట్ సిటీ:కరోనా అలజడి తర్వాత తిరిగి సాధారణ పరిస్థితుల నెలకొల్పడంలో భాగంగా కువైట్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆఫీసుల నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలపటంతో కార్యకలాపాల విధి విధానాలపై సివిల్ సర్వీస్ కమిషన్ తగిన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఆఫీసులలో పని విధానాలను బట్టి వారికి అనుకూలంగా ప్రత్యేకంగా విధానాలు అవలంభించొచ్చని సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే..ఆయా కార్యాలయాల్లో పాటించే విధానాలు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఉండాలని కూడా సూచించారు. వారం షెడ్యూల్ విధానాన్ని అవలంభించాలని, ఒక వారం కొందరు..మరో వారం మరికొందరు విధులకు హజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ పేర్కొంది. పని విధానాన్ని బట్టి వారం షెడ్యూల్ లో మినహాయింపులు ఉంటాయని కూడా వెల్లడించింది. అయితే..ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సూచించిన గరిష్ట సంఖ్యను దాటి ఏక కాలంలో ఉద్యోగులు విధులకు హజరుకావొద్దని కూడా సూచించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







