తెలంగాణలో కొత్తగా 546 కరోనా కేసులు

- June 20, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 546 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో శనివారం రికార్డు స్థాయిలో 546 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,072కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం కరోనాతో ఐదుగురు మరణించగా.. మొత్తం మృతులు సంఖ్య 203గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,363 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 

కొత్తగా వచ్చిన కేసుల్లో GHMC పరిధిలో 458 నమోదయ్యాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి 50, మెడ్చల్‌ 6, మహబూబ్‌నగర్‌ 3, వరంగల్‌ రూరల్‌ 2, వరంగల్‌ అర్బన్‌ 1, జనగాంలో 10, ఖమ్మం 2, కరీంనగర్‌ 13, ఆదిలాబాద్‌లో ఒక కేసు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com