తెలంగాణలో కొత్తగా 546 కరోనా కేసులు
- June 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో శనివారం రికార్డు స్థాయిలో 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,072కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం కరోనాతో ఐదుగురు మరణించగా.. మొత్తం మృతులు సంఖ్య 203గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,363 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కొత్తగా వచ్చిన కేసుల్లో GHMC పరిధిలో 458 నమోదయ్యాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి 50, మెడ్చల్ 6, మహబూబ్నగర్ 3, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 1, జనగాంలో 10, ఖమ్మం 2, కరీంనగర్ 13, ఆదిలాబాద్లో ఒక కేసు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







