1600 మందికి పైగా తొలగించే దిశగా యాహు..
- February 02, 2016
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజ కంపెనీ యాహూ త్వరలో పదహారు వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక కథనం ప్రచురితమైంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం యాహు నాల్గవ త్రైమాసిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.ఫలితాల అనంతరం ఉద్యోగుల తొలగింపు ఉంటుందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయర్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారని అందులో పేర్కొంది. సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో 15 శాతం అంటే సుమారు 1600 మందికి పైగా తొలగించే దిశగా అడుగులు వేస్తోంది.మేనేజ్మెంట్ మార్పుల్లో భాగంగా యాహు డైరెక్టర్లపై ఒత్తడి పెరిగిందని, లాభాలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సంస్ధ నిర్వహణ ఖర్చును నియంత్రించేందుకే ఉద్యోగులను తొలగించనున్నట్లు కథనంలో పేర్కొంది. అర్జెంటీనా, మెక్సికోలో ఉన్న తన కార్యాలయాలను మూసివేయనున్నట్లు యాహూ గత వారమే ప్రకటించింది.అయితే ఎంతమంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల కాలంలో ఈ కామర్స్ను విస్తృతం చేయడంతో యాహు సంస్ధ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటితో పాటు సెర్చ్, వార్తలు, క్రీడలు మొదలైన విభాగాల్లో ఫేస్బుక్, గూగుల్ ఆల్ఫాబెట్ నుంచి యాహు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో యాహు ఫలితాలు సాధించలేదన్న విషయం తెలిసిందే. ఉద్యోగులపై వివక్ష చూపిస్తోదంటూ, చట్టాలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలతో యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో సొంత సంస్థపై దావా వేశాడు. తాజా ఉద్యోగుల తొలగింపుపై యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









