పది గ్రాముల పసిడి ధర రూ.27,300కి చేరింది..

- February 02, 2016 , by Maagulf
పది గ్రాముల పసిడి ధర రూ.27,300కి చేరింది..

పసిడి ధర మూడు నెలల గరిష్ఠానికి చేరింది. రూ.115 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,300కి చేరింది. పెళ్లిళ్ల సీజన్‌ ముందుండటం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2శాతం పెరిగి 1,130.50 అమెరికన్‌ డాలర్లకు చేరింది. గత ఏడాది నవంబరు 3 తర్వాత అక్కడ ఇదే అధిక ధర కావడం గమనార్హం. అయితే దేశీయ బులియన్‌ మార్కెట్లో వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.
60 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.34,870కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలపాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com