చంద్రబాబు సందర్శకులకు ఆర్ధిక సాయం..
- February 02, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి మంగళవారం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి చంద్రబాబును కలవడానికి వచ్చిన వారితో ప్రాగంణం కిక్కిరిసిపోయింది. విద్య, ఆరోగ్య, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారికి ఆర్థికం సాయం అందించారు.► విజయవాడకు చెందిన నాగుల్బికు కిడ్నీ చికిత్స కోసం లక్ష రూపాయల సహాయం ప్రకటించారు. ► గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో ఆమె వైద్యానికి రూ. 2 లక్షలు మంజూరు చేశారు. ► కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన వెంకటరావమ్మ రైలు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ ఆర్ధికంగా దెబ్బతిన్నారు.ఆమెకు రూ. లక్ష రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.పలువురికి ఉన్నత చదువులు, వివాహానికి, వైద్య ఖర్చులకు, ఆర్ధికంగా ఎదుగుదలకు చంద్రబాబు సాయం అందించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి ఆయన భరోసా నిచ్చారు. దీనిపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









