రియాద్: ప్రైవేట్ రంగంలో కరోనా కల్లోలం..ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి భారీగా వినతులు
- June 24, 2020
రియాద్:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియాలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమ సంస్థలు నిలదొక్కుకొని మనుగడ కొనసాగించాలంటే..తమకు ఆర్ధిక మద్దతు ఇవ్వాలంటూ ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇబ్బడిముబ్బడిగా వినతులు వచ్చిపడుతున్నాయి. కరోనా మహమ్మారి విరుచుకుపడిన తర్వాత మార్చి రెండో వారం నుంచి జూన్ రెండో వారం వరకు ప్రైవేట్ రంగంలోని వివిధ సంస్థల నుంచి దాదాపు 95 వేల వినతులు వచ్చినట్లు ఫైనాన్షియల్ అఫైర్స్ లోని అకౌంట్ విభాగం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన వినతుల విలువ SR 47 బిలియన్లని తెలిపింది. అంటే ప్రతి రోజు సగటున SR 522 మిలియన్ల మేర ఆర్ధిక మద్దతు కోరుతూ వినతులు వస్తున్నాయని వివరించింది.
కింగ్ డమ్ విజన్ 2030లో భాగంగా దేశ ఆర్ధిక అభివృద్ధికి దోహదం చేసే ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం కొన్నేళ్లు తగిన తోడ్పాటు అందిస్తోందిని ఈ సందర్భంగా ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ రంగానికి తగిన మద్దతు అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా అందిరికీ తగిన సాయం అందిస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







