మస్కట్:వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరట..కొత్త ప్యాకేజీ నేటి నుంచి అమలు

- June 24, 2020 , by Maagulf
మస్కట్:వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరట..కొత్త ప్యాకేజీ నేటి నుంచి అమలు

మస్కట్:కరోనాతో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఫోకస్ చేసింది ఒమన్ ప్రభుత్వం. ఇందులోభాగంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరటనిచ్చేలా వాటి కార్యకలాపాలకు అవసరమైన కొత్త ప్యాకేజీని నేటి నుంచి అమలు చేయబోతోంది. అయితే ప్యాకేజీ వివరాలు, అమలుకు అవసరమైన పరిస్థితులపై సంబంధిత అధికారులు నేడు ప్రకటించనున్నారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అధ్యక్షతన ఇప్పటికే సమావేశమైంది. దేశంలో కరోనా తీవ్రత..వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించింది. ఈ సందర్భంగానే వాణిజ్య, పారిశ్రామిక రంగాల కార్యాకలాపాలకు సంబంధించి ప్యాకేజీ అమలుపై కూడా చర్చించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com