ఎమర్జెన్సీ విధించి 45 ఏళ్ల అయిన సందర్భంగా మోదీ ట్వీట్‌

- June 25, 2020 , by Maagulf
ఎమర్జెన్సీ విధించి 45 ఏళ్ల అయిన సందర్భంగా మోదీ ట్వీట్‌

న్యూ ఢిల్లీ:ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరచిపోదని ప్రధాని మోదీ అన్నారు. 1975 జూన్‌ 25న మాజీ ప్రధాని ఇందిర ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నాటి ఉద్యమకారులకు మోదీ నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎందరో పోరాడి హింసను ఎదర్కొన్నారని.. వారందరికీ తాను సెల్యూట్ చేస్తున్నా అంటూ ట్విట్టర్‌లో తెలిపారు. దాంతోపాటు.. ఎమర్జెన్సీ సందర్భంగా గత ఏడాది మన్‌ కీ బాత్‌లో మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com