దుబాయ్ - పంజాబ్ కు గురు నానక్ గురుద్వారా వారి ఆధ్వర్యంలో తొలి రిపాట్రియేషన్ చార్టర్ ఫ్లైట్
- June 26, 2020
దుబాయ్ : అనుకున్న షెడ్యూల్ ప్రకారమే దుబాయ్ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కు ఛార్టర్డ్ ఫ్లైట్ బయల్దేరింది. లాక్ డౌన్ తో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా తొలి విమానం దాదాపు 209 మంది భారత ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయల్దేరారు. దుబాయ్ లోని గరుద్వారా గురునానక్ దర్బార్ వారు ఈ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో అమృత్ సర్ కు మరిన్ని ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నారు. తొలి విమానం గురువారం టేకాఫ్ కాగా..రెండో విమానం ఈ నెల 27న బయల్దేరుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మొత్తం 6 ప్రత్యేక విమానాలను పంజాబ్ నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు తోడ్పాటు అందించిన దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులకు గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ ఖాందారి కృతజ్ఞలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష