కువైట్ : ఫర్వానియా, జ్లీబ్ మహబౌలలో కొనసాగనున్న లాక్ డౌన్
- June 26, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో నిర్బంధ ఆంక్షల నుంచి సాధారణ జనజీవనం దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది కువైట్ ప్రభుత్వం. రెండో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో నిషేధ ఆంక్షలను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించారు. వచ్చే మంగళవారం నుంచి రెండో దశ అన్ లాక్ ప్రక్రియ అమలులోకి రానుంది. వాణిజ్య కేంద్రాలు కూడా ప్రారంభించొచ్చని, అయితే..మొత్తం సామర్ధ్యంలో 30 శాతానికి మించకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్వహించుకోవచ్చని కూడా కువైట్ మంత్రి మండలి వెల్లడించింది. అయితే..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఫర్వానియా, జ్లీబ్ మహబౌలలో మాత్రం నిర్బంధ ఆంక్షలు కొనసాగనున్నట్లు మంత్రివర్గం తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఎప్పుడు ఎత్తివేయాలనేది ఆరోగ్య శాఖ అధికారులు తగిన సమయంలో ప్రకటిస్తారని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







