కువైట్ : ఫర్వానియా, జ్లీబ్ మహబౌలలో కొనసాగనున్న లాక్ డౌన్

- June 26, 2020 , by Maagulf
కువైట్ : ఫర్వానియా, జ్లీబ్ మహబౌలలో కొనసాగనున్న లాక్ డౌన్

కరోనా వైరస్ నేపథ్యంలో నిర్బంధ ఆంక్షల నుంచి సాధారణ జనజీవనం దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది కువైట్ ప్రభుత్వం. రెండో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో నిషేధ ఆంక్షలను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించారు. వచ్చే మంగళవారం నుంచి రెండో దశ అన్ లాక్ ప్రక్రియ అమలులోకి రానుంది. వాణిజ్య కేంద్రాలు కూడా ప్రారంభించొచ్చని, అయితే..మొత్తం సామర్ధ్యంలో 30 శాతానికి మించకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్వహించుకోవచ్చని కూడా కువైట్ మంత్రి మండలి వెల్లడించింది. అయితే..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఫర్వానియా, జ్లీబ్ మహబౌలలో మాత్రం నిర్బంధ ఆంక్షలు కొనసాగనున్నట్లు మంత్రివర్గం తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఎప్పుడు ఎత్తివేయాలనేది ఆరోగ్య శాఖ అధికారులు తగిన సమయంలో ప్రకటిస్తారని పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com