మస్కట్:సరిహద్దు ద్వారా రాకపోకలకు ఏకీకృత విధానానికి జీసీసీ ఆమోదం

- June 26, 2020 , by Maagulf
మస్కట్:సరిహద్దు ద్వారా రాకపోకలకు ఏకీకృత విధానానికి జీసీసీ ఆమోదం

మస్కట్:లాక్ డౌన్ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల మధ్య రహదారి రాకపోకల దిశగా జీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లోని పౌరులు, ప్రవాసీయులు సరిహద్దు ద్వారా ప్రయాణం చేసేందుకు రూపొందించిన ఏకీకృత విధానానికి జీసీసీ ఆమోదం తెలిపింది. అయితే..సరిహద్దులు దాటే సమయంలో ఆయా ప్రయాణికులను ఆరోగ్య పరిస్థితులపై అంచనా వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై, సంరక్షణ ఏర్పాట్లపై సుప్రీం కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉందని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..తమ దేశంలోకి వచ్చే ప్రయాణికుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఒమన్ ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా టెస్ట్ రిపోర్ట్ తో రావాలా? వద్దా? అనేది త్వరలోనే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com