టిక్టాక్తో పాటు 59 యాప్స్ నిషేదించిన భారత ప్రభుత్వం
- June 29, 2020న్యూ ఢిల్లీ:చైనీస్ యాప్లకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత్లో 59 చైనీస్ యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వం నిషేధం విధించిన వాటిలో టిక్టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో, వీ చాట్, బ్యూటీ ప్లస్ యాప్స్ కూడా ఉన్నాయి. దేశ రక్షణ, భద్రత దృష్ట్యా చైనా యాప్లపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, చైనీస్ యాప్ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా యాప్లను నిషేధం విధించాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 52 చైనా యాప్స్ను నిషేధించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని కోరాయి.
జూన్ 15న తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలూ యత్నిస్తున్నాయి. అయితే అదే సమయంలో చైనా తన బలగాలను పెంచుతున్న కొద్దీ భారత్ కూడా ఎల్ఏసీ వెంబడి తన జవాన్లను మోహరిస్తూ పోతోంది. ఎల్ఏసీ వెంబడి 3,500 కిలోమీటర్ల వరకూ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా భారత్ నిఘా ఉధృతం చేసింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం