దుబాయ్:జులై 5 నుంచి ఫెడరల్ ఉద్యోగులంతా విధులకు హజరుకావాలని ఆదేశాలు
- June 30, 2020
దుబాయ్:ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇక నుంచి విధులకు హజరుకావాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. జులై 5న ఉద్యోగలు తమ ఆఫీసులలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే..వారు అధికారిక కమిటీ ఆమోదించిన మెడికల్ రిపోర్ట్స్ ని ఆఫీసులలో సమర్పించాలి. గతంలో కొన్ని వర్గాల వారికి ఆఫీసులకు రాకుండా మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గర్భిణులు, పెద్ద వయస్కులు, 9వ గ్రేడ్ కన్న తక్కువ చదువుతున్న పిల్లల తల్లులకు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ నెల నుంచే 50 శాతం ఉద్యోగులతో సాధారణ సేవలు ప్రారంభించారు. ఇదిలాఉంటే 100 శాతం సిబ్బందితో దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 15 నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక షార్జా ప్రభుత్వ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో సేవలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







