దుబాయ్:జులై 5 నుంచి ఫెడరల్ ఉద్యోగులంతా విధులకు హజరుకావాలని ఆదేశాలు
- June 30, 2020
దుబాయ్:ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇక నుంచి విధులకు హజరుకావాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. జులై 5న ఉద్యోగలు తమ ఆఫీసులలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే..వారు అధికారిక కమిటీ ఆమోదించిన మెడికల్ రిపోర్ట్స్ ని ఆఫీసులలో సమర్పించాలి. గతంలో కొన్ని వర్గాల వారికి ఆఫీసులకు రాకుండా మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గర్భిణులు, పెద్ద వయస్కులు, 9వ గ్రేడ్ కన్న తక్కువ చదువుతున్న పిల్లల తల్లులకు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ నెల నుంచే 50 శాతం ఉద్యోగులతో సాధారణ సేవలు ప్రారంభించారు. ఇదిలాఉంటే 100 శాతం సిబ్బందితో దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 15 నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక షార్జా ప్రభుత్వ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో సేవలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







