డాక్టర్లే దేవుళ్లు..వారికి శుభాకాంక్షలు: డా. యు.వి.కృష్ణంరాజు
- July 01, 2020హైదరాబాద్:‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. వైద్యుడు భగవంతుడితో సమానం. తల్లిదండ్రులను జన్మనిస్తే వారు పునర్జన్మను ఇస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడుతన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ రెబల్ స్టార్ డా. యు.వి.కృష్ణంరాజు శుభాకాంక్షలు అందించారు. ``దేశానికి రక్షణ మీరు. మీరు బావుంటే ప్రజలంతా బావుంటారు. ప్రజలంతా బావుంటే దేశమంతా బావుంటుంది. డాక్టర్స్ డే శుభాకాంక్షలు`` అని తెలిపారు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అ…
[1:12 pm, 01/07/2020] Harsha Content: 5 మిలియన్స్ వ్యూస్ని క్రాస్ చేసి ట్రెమండస్ రెస్పాన్స్తో దూసుకుపోతోన్న యాక్షన్ హీరో విశాల్ `చక్ర` ట్రైలర్.
తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ నాలుగు దక్షినాది భాషల్లో ఒకేసారి యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ `చక్ర` ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. పవర్ఫుల్ డైలాగ్స్ తో ఉత్కంఠభరితంగా సాగే ఈ ట్రైలర్ విడుదలైన అన్ని భాషలలో ట్రెమండస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 5 మిలియన్ డిజిటల్ వ్యూస్ని దాటి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని ఆదరిస్తున్న వారందరికి విశాల్ దన్యవాదాలు తెలిపారు. బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో సరికొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన `చక్ర` పోస్టర్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. హీరోయిన్గా పోలీస్ ఆఫిసర్ పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా కసాండ్ర నటిస్తోంది. ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యాక్షన్ హీరో విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : బాలసుబ్రమనియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్,రచన- దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు