కువైట్:జులై 9 నుంచి జ్లీబ్, మహ్బైల్లాలో లాక్ డౌన్ ఎత్తివేత
- July 03, 2020కువైట్:మూడు నెలల తర్వాత జ్లీబ్, మహ్బౌల్లా, అల్ షుయౌఖ్ ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి విముక్తి కలగనుంది. ఈ మూడు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. ఈ నెల 9 ఉయదం 5 గంటల నుంచి కేబినెట్ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మూడు ప్రాంతాల్లో ప్రవాసీయులే ఎక్కువగా ఉంటారు. అయితే..కరోనాకు హాట్ స్పాట్ గా మారటంతో ఏప్రిల్ 6 నుంచి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఇదిలాఉంటే...కరోనా తీవ్రత ఇంకా అదుపులోకి రాకపోవటంతో వైద్యశాఖకు KD75 మిలియన్లను కేటాయిస్తున్నట్లు మంత్రిమండలి సమవేశంలో ప్రధాని ప్రకటించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన వ్యాక్సిన్, ఇతర మెడికల్ కిట్లను కొనేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ రంగంపై ఎలాంటి నెగటీవ్ ప్రభావం పడకుండా మానవ వనరులశాఖ కు KD240 మిలియన్లను కేటాయించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ