కువైట్:జులై 9 నుంచి జ్లీబ్, మహ్బైల్లాలో లాక్ డౌన్ ఎత్తివేత
- July 03, 2020
కువైట్:మూడు నెలల తర్వాత జ్లీబ్, మహ్బౌల్లా, అల్ షుయౌఖ్ ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి విముక్తి కలగనుంది. ఈ మూడు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. ఈ నెల 9 ఉయదం 5 గంటల నుంచి కేబినెట్ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మూడు ప్రాంతాల్లో ప్రవాసీయులే ఎక్కువగా ఉంటారు. అయితే..కరోనాకు హాట్ స్పాట్ గా మారటంతో ఏప్రిల్ 6 నుంచి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఇదిలాఉంటే...కరోనా తీవ్రత ఇంకా అదుపులోకి రాకపోవటంతో వైద్యశాఖకు KD75 మిలియన్లను కేటాయిస్తున్నట్లు మంత్రిమండలి సమవేశంలో ప్రధాని ప్రకటించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన వ్యాక్సిన్, ఇతర మెడికల్ కిట్లను కొనేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ రంగంపై ఎలాంటి నెగటీవ్ ప్రభావం పడకుండా మానవ వనరులశాఖ కు KD240 మిలియన్లను కేటాయించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









