కువైట్:జులై 9 నుంచి జ్లీబ్, మహ్బైల్లాలో లాక్ డౌన్ ఎత్తివేత
- July 03, 2020
కువైట్:మూడు నెలల తర్వాత జ్లీబ్, మహ్బౌల్లా, అల్ షుయౌఖ్ ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి విముక్తి కలగనుంది. ఈ మూడు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. ఈ నెల 9 ఉయదం 5 గంటల నుంచి కేబినెట్ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మూడు ప్రాంతాల్లో ప్రవాసీయులే ఎక్కువగా ఉంటారు. అయితే..కరోనాకు హాట్ స్పాట్ గా మారటంతో ఏప్రిల్ 6 నుంచి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఇదిలాఉంటే...కరోనా తీవ్రత ఇంకా అదుపులోకి రాకపోవటంతో వైద్యశాఖకు KD75 మిలియన్లను కేటాయిస్తున్నట్లు మంత్రిమండలి సమవేశంలో ప్రధాని ప్రకటించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన వ్యాక్సిన్, ఇతర మెడికల్ కిట్లను కొనేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ రంగంపై ఎలాంటి నెగటీవ్ ప్రభావం పడకుండా మానవ వనరులశాఖ కు KD240 మిలియన్లను కేటాయించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







