మసీదులలో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..మరికొంత కాలం మూసివేత

- July 03, 2020 , by Maagulf
మసీదులలో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..మరికొంత కాలం మూసివేత

మనామ:కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులలో సామూహిక ప్రార్ధనలను రద్దు చేసింది బహ్రెయిన్. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ తమ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిజానికి గతంతో పోలిస్తే జూన్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జనం భౌతిక దూరం పాటించకపోవటం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యశాఖ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సుప్రీం కౌన్సిల్..మసీదులను మరికొంత కాలం మూసివేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రార్ధనలను కూడా రద్దు చేసింది. ప్రతి రెండు వారాలకు ఓ సారి సమావేశమై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలను సమీక్షించుకుంటామని కూడా వెల్లడించింది.  

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రథినిధి, బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com