మసీదులలో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..మరికొంత కాలం మూసివేత
- July 03, 2020
మనామ:కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులలో సామూహిక ప్రార్ధనలను రద్దు చేసింది బహ్రెయిన్. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ తమ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిజానికి గతంతో పోలిస్తే జూన్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జనం భౌతిక దూరం పాటించకపోవటం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యశాఖ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సుప్రీం కౌన్సిల్..మసీదులను మరికొంత కాలం మూసివేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రార్ధనలను కూడా రద్దు చేసింది. ప్రతి రెండు వారాలకు ఓ సారి సమావేశమై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలను సమీక్షించుకుంటామని కూడా వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రథినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







