మసీదులలో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..మరికొంత కాలం మూసివేత
- July 03, 2020మనామ:కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులలో సామూహిక ప్రార్ధనలను రద్దు చేసింది బహ్రెయిన్. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ తమ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిజానికి గతంతో పోలిస్తే జూన్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జనం భౌతిక దూరం పాటించకపోవటం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యశాఖ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సుప్రీం కౌన్సిల్..మసీదులను మరికొంత కాలం మూసివేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రార్ధనలను కూడా రద్దు చేసింది. ప్రతి రెండు వారాలకు ఓ సారి సమావేశమై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలను సమీక్షించుకుంటామని కూడా వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రథినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు